
తాను ముఖ్యమంత్రి హోదాలో కాకుండా ఓ మామూలు వ్యక్తిలా రైతుల్ని కలవడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అయితే తాను బయల్దేరే సమయంలో పోలీసులు తన ప్లాన్ తెలిసిపోయి బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ సరిహద్దులో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను కలవడానికి బయల్దేరిన కేజ్రీవాల్ను ఆయన నివాసంలోనే నిర్బంధించిన విషయం తెలిసిందే. అయితే చాలా సమయం తర్వాత ఆయనకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది.