
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. రోడ్డుప్రమాదంలో స్వల్పగాయాలతో బయపట్టారు. హైదరాబాద్ నుండి సూర్యాపేట పర్యటనకు వెళ్తున్న ఆయన కారు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. కారులో దత్తాత్రేయ, వ్యక్తిగత సహాయకుడు,డ్రైవర్ ఉన్నారు. దత్తాత్రేయ సహాయకుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హైదరాబాద్కు తరలించారు.