HomeజాతీయంBihar Election 2025 Survey: టైమ్స్ నౌ - జేవీసీ సర్వే: బీహార్లో గెలుపు ఎవరిదంటే?

Bihar Election 2025 Survey: టైమ్స్ నౌ – జేవీసీ సర్వే: బీహార్లో గెలుపు ఎవరిదంటే?

Bihar Election 2025 Survey: దేశ రాజకీయాలను పక్కనపెట్టి.. బీహార్ రాష్ట్రంలో చావో రేవో తేల్చుకోవడానికి రాహుల్ గాంధీ ఏకంగా అక్కడే ఆయన తిష్ట వేశారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. త్వరలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రధానంగా ఆ రాష్ట్రాన్ని ఫోకస్ చేశారు. ఆ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే ఆయన పట్టుదల సాధ్యమవుతుందా.. ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా.. అనే ప్రశ్నలకు “టైమ్స్ నౌ – జేవీసీ” సమాధానం చెప్పింది.

Also Read: ఓడిపోయినోడ్ని ‘అగ్నిపరీక్ష’ కి జడ్జిగా పెడతారా..? నవదీప్ పై రెచ్చిపోయిన కౌశల్!

బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గడిచిన రెండు పర్యాయాలు ఇక్కడ ఏక పార్టీ ప్రభుత్వం ఏర్పడలేదు. ఏ పార్టీకి కూడా బీహార్ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టలేదు.. మొదట్లో కాంగ్రెస్, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఆ కూటమిలో చీలికలు, పీలికలు ఏర్పడడంతో నితీష్ కుమార్ కు బిజెపి సపోర్ట్ ఇచ్చింది.. దీంతో అక్కడ బిజెపి, నితీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్నికల్లో కూడా ఇదే కూటమి పోటీ చేస్తోంది. ఇప్పటికే సీట్ల పంపకం పూర్తయిందని తెలుస్తోంది.

గెలిచేది ఆ పార్టీనే

టైమ్స్ నౌ, జేవీసీ సర్వేలో ఎన్డీఏ కు బీహార్ రాష్ట్రంలో 136 స్థానాలు వస్తాయని తేలింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో మహా గట్ బంధన్ 75 స్థానాలకే పరిమితమవుతుందని తేలింది. ఇందులో ఆర్ జె డి కి 52, కాంగ్రెస్ పార్టీకి పై స్థానాలు వస్తాయని పేర్కొంది.. గడచిన ఎన్నికలతో పోల్చి చూస్తే ఆర్జెడీకి 23, కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు తగ్గుతాయని టైమ్స్ నౌ సర్వేలో తేలింది.

సర్వే ఎప్పుడు చేశారంటే..

ఈ సర్వే జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్యలో చేశామని టైమ్స్ నౌ పేర్కొంది. ఇక ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల జరిగితే ఎన్డీఏకు 324 సీట్లు వస్తాయని తేలింది. ఇందులో భారతీయ జనతా పార్టీకి 260 స్థానాలు వస్తాయని స్పష్టమైంది. గడచిన పార్లమెంటు ఎన్నికల కంటే ఈసారి బిజెపికి స్థానాలు పెరుగుతాయని ఇండియా టుడే పేర్కొంది. వచ్చేసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన బలం (272) దక్కుతుందని పేర్కొంది. ఇక ఇండికూటమికి 208 స్థానాలు మాత్రమే లభిస్తాయని వెల్లడించింది. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 543 స్థానాలకు బీజేపీ 240 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన 32 స్థానాలను మిత్రపక్షాల నుంచి భర్తీ చేసుకుంది.. ఇక ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ద్వారా బిజెపి తిరిగి పూర్వశక్తిని సంతరించుకుంది. ఇండియా టుడే ఈ సర్వే ను జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు నిర్వహించింది. అన్ని పార్లమెంటు స్థానాలలో 54,788 మంది అభిప్రాయాలను సేకరించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version