అభిమానులకు బ్రేకింగ్ న్యూస్ చెప్పిన ‘ఆర్ఆర్ఆర్’

టాలీవుడ్ స్టార్లు రాంచరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్ ప్రైజ్ కు దర్శకధీరుడు రాజమౌళి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. Also Read: నర్సింగ్ యాదవ్ చివరి కోరిక తీరకుండానే చనిపోయారట! కరోనా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో ఇప్పటికే చిత్రబృందం షూటింగ్ ను మొదలు పెట్టింది. అన్నట్లుగానే చకచకా షూటింగ్ ప్రారంభించి షార్ట్ గా ‘కొమురం భీం’ టీజర్ ను విడుదల చేసింది. ఆ […]

Written By: NARESH, Updated On : January 20, 2021 6:08 pm
Follow us on

టాలీవుడ్ స్టార్లు రాంచరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్ ప్రైజ్ కు దర్శకధీరుడు రాజమౌళి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: నర్సింగ్ యాదవ్ చివరి కోరిక తీరకుండానే చనిపోయారట!

కరోనా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో ఇప్పటికే చిత్రబృందం షూటింగ్ ను మొదలు పెట్టింది. అన్నట్లుగానే చకచకా షూటింగ్ ప్రారంభించి షార్ట్ గా ‘కొమురం భీం’ టీజర్ ను విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పటిదాకా ఒక్క అప్ డేట్ కూడా రాలేదు.ఈ క్రమంలోనే కొత్త సంవత్సరం సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ చెబుతూ రాజమౌళి ట్విస్ట్ ఇచ్చాడు. ‘ఈ ఏడాది మీకు అద్భుతమైన అనుమూతిని ఇస్తాం’ అంటూ శుభాకాంక్షలు చెప్పారు.

తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీజర్ ను విడుదల చేసే ప్లాన్ ను చేస్తున్నాడట రాజమౌళి. స్వాతంత్ర్య సంగ్రామం నాటి కథకావడంతో ఆ రోజున విడుదల చేస్తే హైప్ వస్తుందని రాజమౌళి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలో విడుదల చేయబోయే టీజర్ కు అగ్రహీరో చిరంజీవితో వాయిస్ ఇప్పించాలని చిత్రబృందం యోచిస్తోందట.. దీంతో ఈ నెలలో ఖచ్చితంగా కేజీఎఫ్2ను మించిపోయేలా రాజమౌళి టీజర్ ఉంటుందని ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు.

Also Read: మోనాల్ కి జ్ఞాపకమే మిగిలింది !

అయితే ఈ ఊహాగానాల నడుమ సినిమా అభిమానులకు ‘ఆర్ఆర్ఆర్’ మరో శుభవార్త చెప్పింది. ‘క్లైమాక్స్ షూట్ మొదలైందంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వార్త టాలీవుడ్ తోపాటు దేశ సినిమా రంగంలో అత్యంత ఆసక్తి రేపుతోంది.

లక్ష్యాన్ని సాధించేందుకు ‘రామరాజు’, భీమ్ వస్తున్నారంటూ ట్వీట్ చేసింది. దీంతోపాటు ఆఖరి పోరాటానికి సంబంధించిన ఒక ఫొటోను కూడా ‘ఆర్ఆర్ఆర్’ టీం పంచుకుంది.

చారిత్రక పాత్రలైన సీతారామరాజు, కొమురం భీంలకు ఫిక్షనల్ స్టోరీని జోడించి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా బోలెడు అంచనాలున్నాయి. అలియాభట్, ఓలివియా మోరిస్, హిందీ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. డీవీవీ దానయ్య నిర్మాత ఈ సమ్మర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్