spot_img
Homeఅత్యంత ప్రజాదరణరైతుల ఖాతాల్లో మళ్లీ రూ.2000.. ఎలా చెక్ చేయాలంటే..?

రైతుల ఖాతాల్లో మళ్లీ రూ.2000.. ఎలా చెక్ చేయాలంటే..?

PM Kisan Samman Nidhi 8th Instalment

కేంద్రం రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ స్కీమ్ 8వ విడత నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దేశంలోని 11.66 కోట్ల మంది రైతులకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈరోజు నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయని సమాచారం.

Also Read: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..?

రైతుల ఖాతాలలో 2,000 రూపాయలు జమై ఉంటే మొబైల్ ఫోన్ కు నగదు జమైనట్లు మెసేజ్ వస్తుంది. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా కూడా ఈ స్కీమ్ కు సంబంధించిన నగదు జమైందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు మెసేజ్ రాకపోతే మాత్రం 2,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో ఇంకా జమ కాలేదని అర్థం చేసుకోవాలి. అర్హత ఉండి నగదు జమ కాని వాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

రోజురోజుకు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ కింద రైతుల ఖాతాలలో ఏకంగా 6,000 రూపాయలు జమ చేస్తోంది. అయితే కేంద్రం విడతల వారీగా ఈ నగదును రైతుల ఖాతాలలో జమ చేస్తుండటం గమనార్హం. కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక స్కీమ్ లను అమలు చేస్తున్నాయి.

Also Read: ప్రజలకు శుభవార్త.. ఆధార్ పాన్ లింక్ గడువు పొడిగింపు..?

రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఏపీలోని జగన్ సర్కార్, తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ వేర్వేరు పేర్లతో రైతులకు పెట్టుబడి అందించే స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper