‘మీటూ’ పై కియారా అద్వానీ హాట్ కామెంట్

సినీరంగానికి చెందిన మహిళలు లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘మీటూ’ ఉద్యమం చేపడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా సీని ఇండస్ట్రీలోని మహిళలందరూ వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ప్రస్తుతం ధైర్యంగా మాట్లాడుతున్నారు. హాలీవుడ్‌లో ‘మీటూ ఉద్యమం’ క్రమంలో బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు వ్యాపించింది. ప్రముఖ హీరోయిన్లు సైతం ‘మీటూ ఉద్యమం’లో తాము ఎదుర్కొన్న సంఘటనలు పేర్కొనడం గమనార్హం. బాలీవుడ్లో తనుశ్రీ దత్త ‘మీటూ’ ఉద్యమానికి నాంది పలికారు. ఆ తర్వాత ఒక్కొక్కరు తాము సీనీ రంగంలో ఎదుర్కొన్న […]

Written By: Neelambaram, Updated On : March 11, 2020 5:10 pm
Follow us on

సినీరంగానికి చెందిన మహిళలు లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘మీటూ’ ఉద్యమం చేపడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా సీని ఇండస్ట్రీలోని మహిళలందరూ వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ప్రస్తుతం ధైర్యంగా మాట్లాడుతున్నారు. హాలీవుడ్‌లో ‘మీటూ ఉద్యమం’ క్రమంలో బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు వ్యాపించింది. ప్రముఖ హీరోయిన్లు సైతం ‘మీటూ ఉద్యమం’లో తాము ఎదుర్కొన్న సంఘటనలు పేర్కొనడం గమనార్హం.

బాలీవుడ్లో తనుశ్రీ దత్త ‘మీటూ’ ఉద్యమానికి నాంది పలికారు. ఆ తర్వాత ఒక్కొక్కరు తాము సీనీ రంగంలో ఎదుర్కొన్న లైంగిక వైధింపులపై పెదవివిప్పారు.ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ‘మీటూ’పై స్పందించారు. ‘మీటూ’ వల్ల చిత్ర పరిశ్రమలో పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. మహిళలతో దర్శకులు, హీరోలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని కాజోల్ వ్యాఖ్యానించింది.

తాజాగా హాట్ బ్యూటీ కియారా అడ్వాణీ ‘మీటూ’పై స్పందించారు. ‘మీటూ’ వల్ల పెద్ద మార్పు ఏమి జరుగలేదని చెప్పింది. ‘మీటూ’ వల్ల ప్రపంచమేమీ మారిపోలేదని పేర్కొంది. మహిళలంతా ‘మీటూ’ తర్వాతి దశకు చేరుకోలేదని.. దీని ఫలితం ఇంకా రాలేదని కియారా వ్యాఖ్యానించింది. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ మూవీతో కియారా అడ్వాణీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే రాంచరణ్ కు జోడీగా ‘వినయవిధేయరామ’ మూవీలో నటించింది. ప్రస్తుతం కియారా బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.