ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: టాప్ ప్లేసులో మన ఆటగాళ్లే.. ఎవరంటే?

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో భారత ఆటగాళ్ల ఆదిపత్యం కొనసాగింది. బ్యాటింగ్ విభాగంలో మనోళ్లే టాప్ లో కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కెప్టెన్ రోహిత్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు. ఐసీసీ తాజా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో తిరిగి భారత ఆటగాళ్లు బ్యాటింగ్ విభాగంలో తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మూడోస్తానంలో బ్యాటింగ్ విభాగంలో ఉన్నారు. రాస్ టేలర్, ఆరోన్ ఫించ్ […]

Written By: NARESH, Updated On : January 28, 2021 8:59 am
Follow us on

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో భారత ఆటగాళ్ల ఆదిపత్యం కొనసాగింది. బ్యాటింగ్ విభాగంలో మనోళ్లే టాప్ లో కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కెప్టెన్ రోహిత్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు.

ఐసీసీ తాజా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో తిరిగి భారత ఆటగాళ్లు బ్యాటింగ్ విభాగంలో తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మూడోస్తానంలో బ్యాటింగ్ విభాగంలో ఉన్నారు. రాస్ టేలర్, ఆరోన్ ఫించ్ 4, 5వ స్థానాల్లో ఉన్నారు.

బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్డ్ టాప్ 1లో ఉన్నారు. సెకండ్ స్థానంలో అఫ్గాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహమాన్ నిలవడం విశేషం. మన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడోస్థానంలో ఉండగా.. ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా టాప్ 20లో ఉన్నారు.

విండీస్ తో జరిగిన సిరీస్ లో విజయవంతమైన బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహిదీ హసన్ ఏకంగా నాలుగో ర్యాంకులో నిలవడం విశేషం. బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ కూడా 8వ స్థానంలో చేరుకున్నాడు.