ప్రభాస్ ‘ఆదిపురుష్’కు షాక్..

యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది షాకింగ్ న్యూస్. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్.. క్రిషన్ కుమార్.. ప్రసాద్ సుతార్.. రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అనుకోని ఉపద్రవం వచ్చేసింది. ‘ఆదిపురుష్’ సినిమా కోసం ముంబైలో వేసిన భారీ సెట్ లో భారీ అగ్నిప్రమాదం […]

Written By: NARESH, Updated On : February 2, 2021 9:28 pm
Follow us on

యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది షాకింగ్ న్యూస్. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్.. క్రిషన్ కుమార్.. ప్రసాద్ సుతార్.. రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అనుకోని ఉపద్రవం వచ్చేసింది.

‘ఆదిపురుష్’ సినిమా కోసం ముంబైలో వేసిన భారీ సెట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలోని ఓ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ తొలి రోజే అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

దాదాపు 8 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ప్రమాద సమయంలో హీరో ప్రభాస్, సైఫ్ అలీఖాన్ షూటింగ్ ప్రాంతంలో లేరని చిత్రవర్గాలు తెలిపాయి.

దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో 3డీలో ఆదిపురుష్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.