Rythu Bima: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రయోజనం చేకూర్చడం కొరకు ఎన్నో స్కీమ్స్ అమలు చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్ రైతుల కోసం అమలు చేస్తున్న స్కీమ్స్ లో రైతు బీమా స్కీమ్ కూడా ఒకటి. ప్రభుత్వం బడ్జెట్ లో ఈ స్కీమ్ కోసం ఏకంగా రూ.24,254 కోట్లు కేటాయించడం గమనార్హం. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న రైతుబంధు స్కీమ్ వల్ల రైతులకు ఎంతో బెనిఫిట్ కలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ తో పాటు రైతులకు మరింత బెనిఫిట్ కలగాలనే ఆలోచనతో ప్రభుత్వం రైతు బీమా స్కీమ్ ను అమలు చేస్తోంది.
వేరే ప్రాంతంలో భూములను కలిగి ఉంటే మాత్రం ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందడం సాధ్యం కాదు. పార్మర్స్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈ స్కీమ్ అసలు పేరు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా ఏదైనా కారణం వల్ల రైతు మరణిస్తే రైతు కుటుంబీకులకు 5లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయనుంది. ప్రభుత్వం ఎల్.ఐ.సీకి ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
ఏదైనా కారణం వల్ల రైతు మరణిస్తే నామినీ బ్యాంక్ అకౌంట్ లో ఈ స్కీమ్ కు సంబంధించిన నగదు జమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిన్న సన్నకారు రైతులు ఈ స్కీమ్ కు అర్హులు. 040 2338 3520 నంబర్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
