spot_img
Homeక్రీడలుT20 World Cup 2022- India vs Bangladesh: బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోయేది? మ్యాచ్...

T20 World Cup 2022- India vs Bangladesh: బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోయేది? మ్యాచ్ మలుపుతిరిగిందిక్కడే?

T20 World Cup 2022- India vs Bangladesh: విరాట్ కోహ్లీ, రాహుల్, సూర్య కుమార్ యాదవ్ ఈ ముగ్గురు ఆడటం వల్ల భారత్ 185 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కానీ చేజింగ్ దిగిన బంగ్లా జట్టు ఎదురుదాడినే అస్త్రంగా ఎంచుకుంది. లిటన్ దాస్ తుఫాన్ ఇన్నింగ్స్ తో 7 ఓవర్లకు వికెట్లు ఏమీ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. బౌలర్లు పోటీపడి పరుగులు ఇస్తున్న వేళ ఉశమనం ఇచ్చేందుకు వచ్చాడా అన్నట్టుగా వరుణుడు వర్షం కురిపించాడు. వర్షం అసలు ఆగేలా కనిపించలేదు. అక్కడితో ఆట ఆగిపోతే భారత్ కథ ముగిసిపోయేదే. అప్పటికే డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 17 పరుగుల ముందంజలో ఉంది బంగ్లాదేశ్. వర్షం విడవకుంటే భారత్ ఖాతాలో మరో ఓటమి జమ అయ్యేది. సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యేవి. కానీ వరుణుడు శాంతించాడు.. ఇదాకా మంచి ఊపులో ఉన్న బంగ్లాదేశ్ విరామం తర్వాత తడపడింది. భారత బౌలర్లు పుంజుకోవడంతో ప్రత్యర్థి జట్టు తుదికంటా పోరాడింది. కానీ విజయం మనల్ని వరించింది. మధ్యలో మైదానాన్ని ముంచేత్తుతున్నప్పుడు వర్షాన్ని తిట్టుకున్న భారత అభిమానులు.. చివరకు కృతజ్ఞతలు చెప్పుకునే ఉంటారు. ఎందుకంటే పంగ్లా పూర్తి లయ తప్పింది. భారత్ వైపు మ్యాచ్ మొగ్గింది వర్షం తర్వాతే. లిటన్ దాస్ రన్ అవుట్ కావడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.

T20 World Cup 2022- India vs Bangladesh
T20 World Cup 2022- India vs Bangladesh

అడిలైడ్ లో జోరు వర్షానికి ముందు భారత జట్టుపై పిడుగు పడింది. ఆ పిడుగు పేరు లిటన్ దాస్. భారత బౌలర్లపై ఈ మధ్యకాలంలో ఏ బ్యాటరూ చేయని రీతిలో ఎదురు దాడికి దిగాడు. భారీ లక్ష్య చేదనలో బంగ్లాకు ఎలాంటి ఆరంభం కావాలో అదే ఇచ్చాడు. మబ్బులు కమ్మి ఉండటంతో ఏ క్షణాన అయినా వర్షం కురిసే అవకాశం ఉండవచ్చనే అంచనాతో డ/లూ విధానంలో ముందు ఉండాలనే యోచనతో అతడికి విధ్వంసం సృష్టించే బాధ్యత అప్పగించింది. జట్టు కోరుకున్నట్టు గానే అతడు చెలరేగిపోయాడు. భువి, ఆర్శ్ దీప్, షమీ ఇలా ఎవరినీ లెక్క పెట్టలేదు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సర్లు, ఫోర్లు బాదాడు. పవర్ ప్లే ముగిసే నాటికి బంగ్లా స్కోరు 60. అందులో లిటన్ వాటా 50 పరుగులు అంటే అతడు ఏ స్థాయిలో చెలరేగి పోయాడో అర్థం చేసుకోవచ్చు. అయితే వర్షం అతడి జోరుకు అడ్డు కట్ట వేసింది. ఆ సమయానికి డక్ వర్త్ లూయిస్ విధానం లో బంగ్లా నే గెలిచే స్థితిలో ఉంది. వాన జోరు పెరగడంతో అభిమానుల్లోనూ టెన్షన్ నెలకొంది .

ఆట ప్రారంభం కావడంతో

వాన తగ్గాక ఆట మొదలయింది. తర్వాత 9 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సి రావడం ఏమంత కష్టం అనిపించలేదు. కానీ ఆట మొదలయ్యాక బంగ్లా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. లిటన్ రన్ అవుట్ అయ్యాడు. నజ్మూల్ శాంటో షమీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అర్ష్ దీప్ ఒకే ఓవర్ లో అసీఫ్, షకీబ్ ను అవుట్ చేశాడు. హార్దిక్ తర్వాత ఓవర్ లో యాసిర్ అలీ, మొసాదెక్ లను బుట్టలో వేసుకున్నాడు. అప్పటికి 13 ఓవర్లకు బంగ్లా స్కోర్ 108/6. మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపుతుండగా.. చివరి 3 ఓవర్లలో 43 పరుగులు చేయాల్సి వచ్చింది.

T20 World Cup 2022- India vs Bangladesh
T20 World Cup 2022- India vs Bangladesh

ఇక మ్యాచ్ సొంతం అయినట్టే అనుకుంటుండగా నురుల్, తస్కిన్ ధాటిగా ఆడి బంగ్లాను మళ్లీ రేసులోకి తెచ్చారు. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. అర్శ్ దీప్ 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ భారత్ వశమయింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్ అభిమానులను సీటు చివరి అంచులో కూర్చో బెట్టింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper