Homeఆధ్యాత్మికంAshta Vinayaka Temples: అష్ట వినాయక క్షేత్రాలు... ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Ashta Vinayaka Temples: అష్ట వినాయక క్షేత్రాలు… ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Ashta Vinayaka Temples: మహాశివుడి జ్యోతిర్లింగాలు తెలుసు.. మహాశక్తి అష్టదశ పీఠాల గురించి విన్నాం.. కానీ మరో దేవుడికి కూడా అష్ట క్షేత్రాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు. ఆ దేవుడు ఎవరో కాదు మహాగణపతి. ఏ పూజ కార్యక్రమం అయినా.. గణపతికి నివేదించిన తర్వాతే ప్రారంభించాలి. అంటే గణపతి పూజ చేసిన తర్వాతనే కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవాలి. అలాంటి మహాగణపతికి 8 గణపతి క్షేత్రాలు ఉన్నాయన్న విషయం కొంతమందికే తెలుసు. ఈ క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల ఎన్నో […]

Ashta Vinayaka Temples: మహాశివుడి జ్యోతిర్లింగాలు తెలుసు.. మహాశక్తి అష్టదశ పీఠాల గురించి విన్నాం.. కానీ మరో దేవుడికి కూడా అష్ట క్షేత్రాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు. ఆ దేవుడు ఎవరో కాదు మహాగణపతి. ఏ పూజ కార్యక్రమం అయినా.. గణపతికి నివేదించిన తర్వాతే ప్రారంభించాలి. అంటే గణపతి పూజ చేసిన తర్వాతనే కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవాలి. అలాంటి మహాగణపతికి 8 గణపతి క్షేత్రాలు ఉన్నాయన్న విషయం కొంతమందికే తెలుసు. ఈ క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల ఎన్నో జన్మల పాపం తొలగిపోతుందని భక్తులు నమ్ముతారు. మరి వినాయకుడి కి ఉండే ఈ అష్ట క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి? వాటికి ఏమని పేర్లు పెట్టారు?

Also Read: గుడిలో ఆడవారు తలనీలాలు సమర్పించవచ్చా?

మహాగణపతికి 8 ఆలయాలు మహారాష్ట్రలో ఉన్నాయి. వీటిని అష్ట వినాయక క్షేత్రాలు అని అంటారు. ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలని అనుకునేవారు ఈ క్షేత్రాలు దర్శించుకోవడం వల్ల ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అలాగే మహా పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. వీటిలో మొదటిది..

1. మయూరేశ్వర క్షేత్రం:
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఉన్న మయూరేశ్వర క్షేత్రంలో వినాయకుడు మయూర వాహనంపై కనిపిస్తాడు. ఇక్కడ మయూర పక్షి పై వివరిస్తూ మహారాక్షసుడు సింధును సంహరించాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయం చుట్టూ ఎనిమిది గుమ్మాలు ఉంటాయి.

2. సిద్ధి వినాయక క్షేత్రం:
భీమా నది ఒడ్డున ఉన్న ఈ సిద్ధి వినాయక క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. గణపతి సిద్ది ప్రసాదుడిగా ఇక్కడ పూజించబడతాడు. విష్ణు మహా శత్రువు అయిన మధు -కైటబులను సంహరించేందుకు గణపతిని పూజించాడని పురాణం తెలుపుతుంది.

3. బాలేశ్వర క్షేత్రం:
మహాగణపతి ఇక్కడ బాలదేవుడిగా దర్శనం ఇస్తాడు. అందుకే దీనికి బాలేశ్వర క్షేత్రం అన్న పేరు వచ్చింది. ఇక్కడ ఆలయం బండరాయిలతో నిర్మాణం జరిగింది. ఇది పురాతన ఆలయం వలె ఆకట్టుకుంటుంది.

Also Read:  శివుడి ఆరాధనతో మీ జీవితంలో కలిగే గొప్ప మార్పులు ఇవీ

4. వరద వినాయక క్షేత్రం:
మహాడ్ గ్రామంలో ఉన్న ఈ ఆలయం లో ఉన్న వినాయకుడు భక్తులకు వరాలను ప్రసాదిస్తాడని పేర్కొంటారు.

5. చంద్ర వినాయక క్షేత్రం:
ఇక్కడ గణపతి చంద్రకార అలంకరణతో కనిపిస్తాడు. పృద్వి తల్లిని రక్షించేందుకు గణపతి చేసిన యజ్ఞ కథలో వరద వినాయకుడి ప్రస్తావన వస్తుంది.

6. గిరిజాత్మజ క్షేత్రం:
ఇక్కడ వినాయకుడు పర్వత గుహల్లో దర్శనమిస్తాడు. పార్వతీదేవి తపస్సు చేసి గణపతిగా కుమారుడిని పొందిన కథలు తెలుపుతూ గిరిజాత్మజ వినాయకుడిగా ఇక్కడ కనిపిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయానికి వెళ్లాలంటే 300 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

7. విఘ్నేశ్వర క్షేత్రం:
విఘ్నసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత భక్తులకు విఘ్నాలను తొలగించేందుకు వినాయకుడు ఇక్కడ విగ్నేశ్వరుడిగా దర్శనం ఇస్తున్నాడని పురాణాలు తెలుపుతున్నాయి.

Also Read:  రోడ్డుమీద దొరికే ఈ మూడు వస్తువులను అస్సలు తీసుకోవద్దు..

8. మహాగణపతి క్షేత్ర:
మహా రాక్షసుడు త్రిపుర సురుడుని నాశనం చేయడంలో శివుడికి గణపతి సహాయం చేశాడని పురాణాల్లో చెప్పబడింది. ఆ తర్వాత మహాగణపతిగా భక్తులకు ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు.

ఇలా ఎనిమిది క్షేత్రాలు ఒకే రాష్ట్రంలో దర్శనం ఇస్తుంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper