
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల వర్చువల్ సమావేశాలకు అనుమతించాలని కోరుతూ చైర్మన్ వెంకయ్యనాయుడుకు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన విజ్ఞప్తిని రాజ్యసభ తిరస్కరించింది. ఈ మేరకు ఆయనకు రాజ్యసభ సచివాలయం సమాచారం అందించింది. వర్చువల్ సమావేశాలు గోప్యంగా జరగాల్సి ఉందని నిబంధనలు ఉన్నాయని ఈ మేరకు వాటికి మార్పులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మార్పులకు పార్లమెంట్ ఆమోదం అవసరమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఖర్గే లేఖ, స్టాండింగ్ కమిటీల వర్చువల్ సమావేశాలను అనుమతించాలనే పులువురు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ లోక్ సభ స్వీకర్ ఓం బిర్లా ఈ అంశంపై చర్చించారని పేర్కొన్నాయి.