దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 73.09 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 57,763 పాయింట్ల వద్ద లాభాల్లో ఆరంభమైంది. ఇంట్రాడేలో 57,918 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 214 పాయింట్ల నష్టంతో 57,338 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 55 పాయింట్లు దిగజారి 17,076 వద్ద స్థిరపడింది.