Smriti Mandhana half century : అన్ని అనుకున్నట్లు జరిగితే స్మృతి మందాన పక్కన.. ముచ్చల్ అని ఉండేది. అది వాడి దురదృష్టం. బంగారం లాంటి అమ్మాయి ప్రేమికురాలుగా ఉన్నప్పటికీ.. మరికొద్ది క్షణాల్లో ఆమె మెడలో తాళికట్టే అవకాశం వచ్చినప్పటికీ.. వాడి పాత బాగోతాలు మొత్తం బయటికి వచ్చాయి. అప్పటిదాకా ప్రేమికుడని నమ్మిన ఆమెకు.. విరక్తి వచ్చేసింది. ఇన్ని రోజులపాటు ఇటువంటి వ్యక్తితో నా నేను ఉన్నది అనుకుంది. అంతే మొహమాటం లేకుండా వద్దనుకొంది. అని సంవత్సరాల ప్రేమను పక్కన పెట్టింది. ఏకంగా పెళ్లినే క్యాన్సల్ చేసుకుంది.
ఈ ఎపిసోడ్ తర్వాత స్మృతి డిప్రెషన్ లోకి వెళ్లి పోతుంది.. ఆట మీద దృష్టి పెట్టలేదు.. ఇక కష్టమే అని అందరూ అనుకున్నారు. టీమిండియాలో ఉమెన్ విరాట్ కోహ్లీగా పేరు తెచ్చుకున్న ఆమె.. ఇకపై ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయలేదని అందరూ ఒక అంచనాకొచ్చారు. కానీ అలా వెనకడుగు వేస్తే ఆమె స్మృతి ఎందుకు అవుతుంది.. పలాష్ తో జరిగింది మొత్తం ఒక పీడకల అనుకుంది. ఆ బ్యాడ్ ఎపిసోడ్ మొత్తం మర్చిపోయింది. ఇన్ స్టాగ్రామ్ లో వాడి జ్ఞాపకాలు ఉన్న ఫోటోలను మొత్తం తొలగించింది. అంతేకాదు, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. సరికొత్త అవతారంలో కనిపించింది.
ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు మీద ఏకంగా హాఫ్ సెంచరీ చేసింది. అది కూడా జట్టు 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సందర్భంలో.. గట్టిగా నిలబడింది. 44 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేసింది. సెంచరీ చేస్తుంది అనుకుంటున్న క్రమంలో రమీన్ షమీం బౌలింగ్లో అవుట్ అయింది. అప్పటికి కౌర్ తో కలిసి మూడో వికెట్ కు ఏకంగా 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.. తద్వారా పాకిస్తాన్ జట్టుకు మ్యాచ్ మీద పట్టు బిగించే అవకాశం లేకుండా చేసింది.
పాకిస్తాన్ జట్టుపై హాఫ్ సెంచరీ చేయడం ద్వారా స్మృతి సరికొత్త రికార్డును సృష్టించింది. 26 ఇన్నింగ్స్ లలో ఐదు హాఫ్ సెంచరీలు చేసింది. ఈ జాబితాలో మిథాలీ రాజ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆమె 23 ఇన్నింగ్స్ లలో ఐదు హాఫ్ సెంచరీలు చేసింది. కెప్టెన్ కౌర్ 34 ఇన్నింగ్స్ లలో ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. పూనమ్ రౌత్ 15 ఎన్ని నిమిషాలలో 3 హాఫ్ సెంచరీలు చేసింది. రెండు వికెట్లు కోల్పోయినప్పుడు.. కెప్టెన్ కౌర్ తో కలిసి స్మృతి నిదానంగా బ్యాటింగ్ చేసింది. మైదానం మీద అవగాహన ఏర్పడేంతవరకు తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత జూలు విధిల్చిన సింహం లాగా రెచ్చిపోయింది. దీంతో భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. వేరే వాళ్ళ మోజులో పడి పలాష్ స్మృతిని దూరం చేసుకున్నాడు. కానీ, స్మృతికి తాను ఏంటో తెలుసు. అందువల్లే ఈ స్థాయిలో రెచ్చిపోయింది. సూపర్ హాఫ్ సెంచరీ తో అదరగొట్టింది.

