దారుణ హత్యకు గురైన ఆరేళ్ల బాలికకు న్యాయం చేసేందుకు సజ్జనార్ మళ్లీ రావాల్సిందేనని డైరెక్టర్ హరీశ్ శంకర్ అన్నాడు. దీన్ని పరిష్కరించేందుకు సజ్జనార్ సర్ రావాలి. తక్షణ న్యాయం అవసరం. లేకపోతే ఇది ఆగదు. కానీ ఈ వార్తలు వ్యాప్తి చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటి వార్తల ద్వారా స్ఫూర్తి పొందే దిక్కుమాలిన మనుషులున్నారు. ఈ విషయం కేటీఆర్ వరకు చేరుతుందని ఆశిస్తున్నా అంటూ ఆ ట్విట్ లో రాసుకొచ్చారు.