కరోనా ఉచిత చికిత్సలో తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం లేదని ఆక్షేపించారు. అసెంబ్లీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనాతో పేదల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని ఇప్పటి వరకు కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చలేదని విమర్శించారు. గచ్చిబౌలి టిమ్స్ లో సీటీస్కాన్ వసతి కూడా లేదన్నారు.