
రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరాఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. రాజస్థాన్ నుంచి తెలంగాణ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. దీని ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షలు కురుస్తాయని పేర్కొంది.