
ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక హైకోర్టుకు వెళ్లింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి జిల్లా కోర్టు ప్రత్యేక మెసెంజర్ యాప్ ద్వారా నివేదికను పంపింది. కాసేపట్లో హైకోర్టు దీనిపై విచారించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో కోర్టు నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.