
యాస్ తుపానుపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. వర్చువల్ ద్వారా వివిధ మంత్రిత్వశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, టెలికాం విద్యుత్, పౌరవిమానయాన అధికారులు పాల్గొన్నారు. యాస్ తుఫాను సన్నద్ధత ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రధాని సమీక్షించారు. నెల 26న ఒడిషా- బెంగాల్ మధ్య తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో 46 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం సిద్ధం చేసింది.