
రానున్న 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుందని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ నవంబర్ మొదటి వారంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దళిత బంధను ఉద్యమంలా చేయాలన్నారు.