
దేశ రాజధాని నగరం ఢిల్లీకి 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను శనివారమే ఇచ్చి తీరాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ఆధారంగా హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఓ ఆసుపత్రిలో ఎనిమిది మంది ఆక్సిజన్ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని తెలిపింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక విచారణలో జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేక పల్లి డివిజణ్ బెంజ్ ఈ ఆదేశాలిచ్చింది.