Homeజాతీయ వార్తలుChicken neck corridor strategic: మోడీ, షా కు చికెన్ నెక్ మీద ఎందుకంత ఆసక్తి.....

Chicken neck corridor strategic: మోడీ, షా కు చికెన్ నెక్ మీద ఎందుకంత ఆసక్తి.. ఇప్పుడేం జరుగుతోంది

Chicken neck corridor strategic: బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ అధికారంలోకి రాలేదు. 15 సంవత్సరాల పరిపాలించిన ఆమెను బెంగాల్ ప్రజలు తరిమి తరిమి కొట్టారు. చివరికి ఆమె పోటీ చేసిన భవానిపూర్లో ఓడించారు. బిజెపికి పట్టం కట్టారు. దీంతో బెంగాల్ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

దేశ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు వెంట వెంటనే అమలవుతున్నాయి. బెంగాల్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన చికెన్ నెక్ రహదారి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రధానంగా దృష్టి సారించారు. దృష్టి సారించడం మాత్రమే కాదు.. ఆ రోడ్డులో కనివిని ఎరుగని స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రభుత్వం 120 ఎకరాల భూమిని అప్పగించడమే ఆలస్యం.. పనులు మొదలైపోయాయి. దీంతో నాలుగు దేశాల్లో గుబులు మొదలైంది. చైనా ఇప్పటికే అక్కడ ఏం జరుగుతుందో చూస్తోంది. భూటాన్ జాగ్రత్తగా ఉంటోంది. బంగ్లాదేశ్ ఎప్పటికప్పుడు సమాజాన్ని సేకరిస్తుంది. నేపాల్ తన జాగ్రత్తలో తను ఉంటోంది. నిజానికి 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ రోడ్డు ఎందుకు అంత ప్రత్యేకం.. ఏకంగా నాలుగు దేశాలు ఎందుకు అలా అప్రమత్తమయ్యాయి.. ఈ ప్రశ్నల వెనక పెద్ద స్టోరీ ఉంది..

మనదేశంలో ఏడు ఈశాన్య రాష్ట్రాలను కలపడానికి అత్యంత ప్రధానమైన మార్గం చికెన్ నెక్ రహదారి. ఇది కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు.. మన దేశ అంతర్గత భద్రతకు సంబంధించింది.. ఈ రోడ్డు కనక అభివృద్ధి చెందకపోతే.. దీని మీద కేంద్ర బలగాల పెత్తనం లేకపోతే.. దేశం మొత్తం నాశనం అవుతుంది. యుద్ధం లాంటి పరిణామాలు చోటు చేసుకుంటే.. ఈశాన్య రాష్ట్రాలు మన దేశంతో కనెక్టివిటీని కోల్పోతాయి. అందువల్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ రోడ్డును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. చైనా ఇప్పటికే టిబెట్ ప్రాంతంలోని చుంబి వ్యాలీ వద్ద సైనికులను మోహరించింది. నేపాల్ కూడా చైనా గుప్పెట్లో చిక్కుకుంది. బంగ్లాదేశ్ చుట్టు అమెరికా, చైనా, పాకిస్తాన్ మోహరించి ఉన్నాయి. ఇవి భౌగోళికంగా మన మీద ఒత్తిడి పెంచుతున్నాయి. రంగ్ పూర్ ప్రాంతం చుట్టూ కొత్త సైనిక ఒప్పందం జరుగుతున్నాయి. విదేశీ ప్రభావాలు ఉండనే ఉన్నాయి. తీవ్రవాద నెట్వర్క్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీటిపై భారత భద్రతా దళాలు గట్టిగా నిఘా పెట్టాయి. ఇదేమి సాధారణంగా ఉండే సరిహద్దు ఉద్రిక్తత కాదు.

బెంగాల్ ప్రభుత్వం 120 ఎకరాల వ్యూహాత్మకమైన భూమిని అప్పగించడమే ఆలస్యం.. ఏడు జాతీయ రహదారుల నియంత్రణ మొదలైంది. భూగర్భ రైల్వే మార్గాల పని ప్రారంభమైంది. అంతేకాదు డ్రోన్లు.. థర్మల్ కెమెరాలు.. భూగర్భ కదలికలను గుర్తించే సెన్సార్లు.. లేజర్ గోడలు.. ఇవన్నీ కూడా ఇప్పుడు భారత రక్షణ వ్యవస్థలో కీలకమవుతున్నాయి. కేవలం 120 ఎకరాలు మాత్రమే కాదు.. బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర మరో 600 ఎకరాల భూమి కూడా మనదేశ సెక్యూరిటీ జోన్ పరిధిలోకి వస్తోంది. ఈ ప్రకారం అక్కడ సరిహద్దు నిర్మాణం పూర్తిగా మారుతుంది. అంతేకాదు 40 కిలోమీటర్ల మేర భూగర్భ రైల్వే సొరంగ మార్గాన్ని కూడా నిర్మిస్తున్నారు. దానిని 20 మీటర్లకు పైగా లోతులో నిర్మిస్తున్నారు. యుద్ధం వంటి విపత్కర పరిస్థితులు మొదలైతే.. ఏం జరుగుతుందో తెలుసు.. అందువల్లే ఈ స్థాయిలో నిర్మాణాలు మొదలవుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు చికెన్ నెక్ కారిడార్ మీద కేంద్రానికి ఎటువంటి నియంత్రణ లేదు.

మమతాబెనర్జీ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఒక్క చిన్న రోడ్డు పని చేయాలన్నా సరే అనుమతులు వచ్చేవి కాదు. దీంతో జాతీయ భద్రత కూడా స్థానిక రాజకీయ అహంకారంలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం రావడంతో సైన్యం నేరుగా నియంత్రణ తీసుకుంది. హైవే వెడల్పు అవుతుంది. పెద్ద పెద్ద మిస్సైల్స్ వ్యవస్థలు వెళ్లగలిగే విధంగా రోడ్లను సిద్ధం చేస్తున్నారు. రఫెల్ యుద్ధ విమానాలను మోహరించిన బాగ్డోగ్రా వైమానిక స్థావరం వద్ద అత్యంత భారీ సైనిక నిల్వ కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు.. అందువల్లే చికెన్ నెక్ కారిడార్ ను కేవలం ఒక దారిగానే భారత్ చూడడం లేదు. భవిష్యత్తులో జరిగే ఏ పెద్ద యుద్ధానికి అయినా సరే ఇదే కేంద్ర నాడీ బిందువు అవుతుందని భావిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version