హైదరాబాద్ లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 14వ సమావేశం జరుగుతోంది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎం.పి.సింగ్ అధ్యక్షతన సమావేశమైన ఈ భేటీలో ప్రధానంగా 13 అంశాలపై చర్చించనున్నారు. ఇందులో తెలంగాణ, ఏపీ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. వీటితో పాటు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి, గోదావరి జలాల మళ్లింపు, చిన్న నీటి వనరులు, తాగునీటి లెక్కింపులు, బోర్డు తరలింపు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా అనుమతుల్లేని ప్రాజెక్టులు, బోర్డు నిర్వహణ, ఇరు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులపై ఈ భేటీలో చర్చించనున్నారు.