జాతీయ జెండాను కేజ్రీవాల్ అవమానించారు.. కేంద్ర మంత్రి

ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అవమానిస్తున్నరని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు. ఇటీవల కేజ్రీవాల్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్సుల్లో ఆయన కూర్చున్న కుర్చీ వెనుకలా పెట్టిన జాతీయ జెండా హోంమంత్రిత్వశాఖ నిబంధనలకు అనుగుణంగా లేదని అన్నారు. జెండాలో ఆకుపచ్చ రంగును పెద్దదిగా చేసి వక్రీకరించారని, మధ్యలో ఉండే తెలుపుదనాన్ని తగ్గించారని […]

Written By: Suresh, Updated On : May 28, 2021 3:41 pm
Follow us on

ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అవమానిస్తున్నరని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు. ఇటీవల కేజ్రీవాల్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్సుల్లో ఆయన కూర్చున్న కుర్చీ వెనుకలా పెట్టిన జాతీయ జెండా హోంమంత్రిత్వశాఖ నిబంధనలకు అనుగుణంగా లేదని అన్నారు. జెండాలో ఆకుపచ్చ రంగును పెద్దదిగా చేసి వక్రీకరించారని, మధ్యలో ఉండే తెలుపుదనాన్ని తగ్గించారని ఆరోపించారు. దేశ జాతీయ జెండా నియమావళికి ఇది విరుద్ధమన్నారు.