ప్రముఖ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్, పద్మ విభూషణ్ సోలి సొరాబ్జీ మృతి పట్ల ముఖ్య మంత్రి కే. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలిపారు. 91 సంవత్సరాల సొరాబ్జీ శుక్రవారం ఉదయం కోవిడ్ -19 తో కన్నుమూశారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.