
జగన్, కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం రెండు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు పెంచి పెద్దవి చేయొద్దని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. నవసూచనల పేరిట ఏపీ సీఎం జగన్ కు ఆయన మరో లేఖ రాశారు. నదీ జలాల అంశంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెరపడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపిన జగన్ జల వివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని రఘురామ ప్రశ్నించారు. తెలంగాణలోని ఆంధ్రా వారి గురించి సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.