
మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీలో కరోనా రోగులకు ఫాబీఫ్లూ పంచిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్ లో డ్రగ్ కంట్రోలర్ విచారణ చేపట్టింది. గౌతం గంభీర్ ఫౌండేషన్ మాత్రం అక్రమ రీతిలో ఫాబీప్లూ ట్యాబ్లెట్లను నిల్వ చేసిందని, ఈ కేసులో గంభీర్ ఫాండేషన్ దోషిగా తేలినట్లు ఢిల్లీ హైకోర్టుకు ఆ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ శాఖ తెలిపింది. డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ కింద గంభీర్ ఫౌండేషన్ నేరం చేసినట్లు అడ్వకేట్ తెలిపారు. ఇదే యాక్ట్ ప్రకారం ఆప్ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ కూడా దోషిగా తేలినట్లు తెలిపారు.