హుజూరాబాద్ అభివృద్ధి కోసం పనిచేశానని భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హుజూరాబాద్ లో పెద్దగా పెండింగ్ పనులు లేవు. చేసిన పనులకు చాలా మందికి బిల్లులు రావడం లేదు. నాకు బీజేపీ నేతల నుంచి పూర్తి సహకారం ఉంది. నాది కారు గుర్తు అని తెరాస నేతలు ప్రచారం చేస్తున్నారు. రైతు బంధు తెలంగాణ మొత్తం అముల చేసి.. దళిత బంధును హుజూరాబాద్ లోనే ఎందుకు అమలు చేస్తున్నారు? నాకు ఓటేస్తే పథకాల నుంచి పేర్లను తొలగిస్తాం అని ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్ లో డబ్బులు పంచడానికి హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు అమ్మారు అని ఈటల విమర్శించారు.