ప్రభుత్వాలు అన్ని మతాలను గౌరవించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బు ఉండి కూడా సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. మాన్సాస్ సిబ్బందికి జీతాలివ్వమంటే తనపై ఓ ఈవో కేసు పెట్టారన్నారు. తాను కోర్టుకు వెళ్తే జీతాలు ఇవ్వమన్నారు. కానీ ఈవోపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. భూ అక్రమాలపై సర్వేలతో సహా ఇవ్వమని అడిగానని.. కానీ ఇవ్వలేదని చెప్పారు. తనపై ఓ స్రీక్రేట్ రీసెర్చ్ జరుగుతోందన్నారు.