హైకోర్టు, ఇతర దిగువ కోర్టులకు హాజరయ్యే న్యాయవాదులకు లాక్ డౌన్ సమయంలో మినహాయిస్తూ మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. తమ నివాసాల నుండి సంబంధిత కార్యాలయాల వరకు అధికారిక పనుల నిమిత్తమై వెళ్లడానికి న్యాయవాదులకు ఈ-పాస్ లను సంబంధిత పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలు జారీ చేస్తాయని తెలిపింది.