Homeక్రైమ్‌Delhi Blast Red Fort Explosion : నిన్న ఏటీఎస్ దాడులు.. నేడు ఢిల్లీ ఎర్రకోటలో...

Delhi Blast Red Fort Explosion : నిన్న ఏటీఎస్ దాడులు.. నేడు ఢిల్లీ ఎర్రకోటలో పేలుళ్లు.. ఎన్నాళ్లీ మారణ హోమం

Delhi Blast Red Fort Explosion : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర గేట్ -1 వద్ద పార్కింగ్ చేసిన ఓ కారులో పేలుళ్ళు జరిగాయి. ఈ ఘటనలో ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమీపంలో ఉన్న దుకాణాల తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన జరిగిన తర్వాత బాంబ్ స్క్వాడ్ బృందాలతో ఘటన స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు.

మొదట్లో ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. పేలుడు ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. పేలుడు వల్ల 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి శరీరాలు పూర్తిగా చిద్రమయ్యాయి. గాయపడిన వారిని ఎల్ ఎన్ జీ పీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో చాలావరకు వాహనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో దర్యాప్తు బృందాలు విచారణ మొదలుపెట్టాయి. ఈ పేలుడు వెనక ఉగ్ర ఉందేమోనన్న కోణంలో దర్యాప్తును మొదలు పెట్టాయి. ఆదివారం యాంటీ టెర్రరిజం స్క్వాడ్ విస్తృతంగా దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఉగ్ర మూలాలు ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసింది. వారిని అరెస్టు చేసిన తర్వాత ఒకరోజు వ్యవధిలో ఈ ఘటన జరగడం విశేషం.

ఉగ్రవాదులు మనదేశంలో దాడులు జరపడానికి కుట్రలు పన్నారని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తులో తేలింది. పలు ప్రాంతాలలో ఉగ్రవాదులను దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. దీని వెనుక ఉగ్రవాదులు ఉన్నారని దర్యాదు బృందం అధికారులు అనుమానిస్తున్నారు. లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. దేశ రాజధానిలో పేలుడు జరిగిన నేపథ్యంలో ఈ ఘటన సంచలనంగా మారింది.

సరిగ్గా ఆదివారం ఆముదంతో విషయం తయారు చేసే వందల మందిని చంపడానికి కుట్ర చేసిన హైదరాబాద్ ఉగ్రవాది సయ్యద్ అహ్మద్ మోహియుద్దీన్, మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఘటన జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. ఆముదం గింజలను ప్రాసెస్ చేసి.. మిగిలిపోయిన వ్యర్ధాలతో అత్యంత ప్రమాదకరమైన రైసిన్ అనే విష రసాయనాన్ని తయారు చేశారు. ఈ వ్యవహారం దర్యాప్తు బృందం అధికారుల విచారణలో తేలింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular