
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,07,764 మంది నమూనాలు పరీక్షించగా 6,341 కేసులు నమోదయ్యాయి. 57 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మరణించారు. కరోనా నుంచి నిన్న 8,486 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 67, 629 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఏపీ వైద్యారోగ్యశాఖ బులిటిన్ విడుదల చేసింది.