
రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,02,712 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 6,151 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో 58 మంది మరణించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ గురువారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది. కరోనా నుంచి మరో 7,728 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69,831 యాక్టివ్ కేసులు ఉన్నాయి.