
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాలుగు రాష్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండవచ్చో ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేసిన విషయం తెలిసిందే. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఈ మధ్యాహ్నానికి ఓటర్ల తీర్పు సరళి, సాయంత్రం 5 గంటలకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.