జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే, టీటీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇవాళ తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఆయన మీసం మెలేసి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డిపై ఐసీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న జిల్లాలోని పది మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ల ఎన్నిక ముగిసింది. తాడిపత్రిలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి […]

Written By: Velishala Suresh, Updated On : July 31, 2021 3:00 pm
Follow us on

మాజీ ఎమ్మెల్యే, టీటీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇవాళ తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఆయన మీసం మెలేసి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డిపై ఐసీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న జిల్లాలోని పది మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ల ఎన్నిక ముగిసింది. తాడిపత్రిలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి నాలుగో వార్డు కౌన్సిలర్ అబ్బుల్ రహీంకు ఆ పదవి దక్కింది.