తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. మెదక్ జిల్లా మాసాయి పేట మండలం అచ్చం పేటలో భూకబ్జా ఆరోపణలపై సీఎం విచారణకు ఆదేశించారు. రైతుల ఫిర్యాదు పై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆరోపణలపై దర్యాప్తు జరపాలని సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు, విజిలెన్స్ డీజీ పూర్ణ చంద్రరావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.