
ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ నివాసంలో కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం ముగిసింది. భాజపాకు, మోదీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించేందుకే ఈ సమావేశం జరుగుతోందన్న ఊహాగానాల మధ్య జరిగిన ఈ భేటీలో ఎనిమిది రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో అనేక అంశాలపై చర్చించినట్లు యశ్వంత్ సిన్హా వెల్లడించారు.