
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 79.824 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 6,026 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,75,748 కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 52 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2,579కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజు 6,551 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.