కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలో 10, 12 వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. హయ్యర్ సెకండరీ బోర్డు పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిఫుణుల కమిటీని ఏర్పాటు చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడింది. పరీక్షల నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులూ అభిప్రాయం తెలుపాలని ఇటీవల ప్రభుత్వం సూచించింది.