
యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు. కొండ కింద 6 లైన్ల రోడ్లు, గిరి ప్రదక్షిణ రోడ్డు, పుష్కరిణి పనులను పరిశీలించారు. కొండపైన ప్రధానాలయం, లడ్డు విక్రయ కేంద్రం, క్యూ కాంప్లెక్స్, లిప్ట్ పనులను పరిశీలించిన ఆయన వైటీడీ ఏ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు సకాలంలో నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు.