
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నారాయణపేటకు 10 కిలోమీటర్ల దూరంలోనే కర్ణాటక ఉందని చెప్పారు. పక్కనే ఉన్న కర్ణాటకలో మన దగ్గర అమలవుతోన్న ఏ ఒక్క పథకమైనా అమలవుతోందా? అని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదు. చట్టప్రకారం రావాల్సిన వాటాను సాధించుకుంటాం. కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కోట్లాడతాం అని కేటీఆర్ అన్నారు.