spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP : క్వీన్ స్వీప్ సంకేతాలతో జోష్ లో వైసీపీ.. ముందస్తుకు వెళ్తారా?

YCP : క్వీన్ స్వీప్ సంకేతాలతో జోష్ లో వైసీపీ.. ముందస్తుకు వెళ్తారా?

YCP : ప్రజల్లో ఆదరణ తగ్గలేదని వైసీపీ నిరూపించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పూర్తి కాలం పరిపాలన చేస్తామని అన్న మాటపై కట్టుబడే పరిస్థితులు ప్రస్తుతం లేవని జగన్ నమ్ముతున్నట్లున్నారు. పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేలా ప్రకటనలు చేస్తున్నారు. సర్వేలు కూడా రాబోవు ఎన్నికల్లో వైసీపీదే గెలుపని కరాఖండిగా చెప్పేస్తుండటంపై ముందస్తు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం ప్రజల్లో ఉండాలని నాయకులకు దిశా నిర్దేశం చేసి వైసీపీ అధిష్టానం రాష్ట్రాన్ని ఎన్నికల మూడ్ లోకి తీసుకెళ్లిపోయింది.

వైసీపీ ప్రజా ప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ‘‘జగనన్నే మా భవిష్యత్తు’’ స్టిక్కర్లను ఇంటింటికి తగిలిస్తున్నారు. ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ తీసుకొని ఓ నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వమని సూచిస్తున్నారు. ఎందుకొచ్చిన గోల అని అందుకు ఓకే అనేస్తున్నారు. దాంతో ఎక్కువ మంది ఈటీజీ సర్వేలో పాల్గొంటున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. దానినే ప్రముఖంగా చూపుతున్నారు. మరోవైపు టైమ్స్ నౌ వంటి జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో సర్వే చేసి రాబోయేది వైసీపీనేనని ప్రకటించేసింది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపు ఖాయమని అంది. అయితే, ఆ సంస్థలు ఏ విధంగా ఎవరిని ప్రశ్నలు అడిగి నిర్థారణ చేశారో ప్రకటించలేదు. ఓ కాకి లెక్కలను మాత్రం విడుదల చేశారు.

వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వచ్చిన నాలుగేళ్లలో ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసింది. ఇంకా కావాలని కేంద్రాన్ని అడుగుతూనే ఉంది. రాష్ట్ర ఫోన్ కాల్స్ కు కేంద్ర అధికారులు స్పందించడం లేదనే పుకార్లు ఉన్నాయి. ఛీ అన్నా, అప్పు ఇచ్చేది కేంద్రమే కాబట్టి ఏ విధమైన సిగ్గు లేకుండా మరలా ప్రాధేయపడటం పరిపాటిగా మారింది. మరోవైపు అయినవాళ్లు కేసుల్లో ఇరుక్కొని పార్టీని అప్రదిష్టపాల్జేశారు. ఇంతకు ముందులా కేంద్రం నుంచి తగినంత సహకారం అందడం లేదు. ఈ పరిస్థితుల్లో గెలిచేది మనమే, మొత్తం 25 ఎంపీలు బుట్టలో పడనున్నాయని ప్రకటనలు వస్తే కేంద్రం మనసు మారుతుందనే ఆలోచన ఉండవచ్చని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

విశాఖ విషయంలో జగన్ కామెంట్లు చేస్తున్నారు. పరిపాలన రాజధాని అని ప్రకటించారు. పలు ఫిషింగ్ హార్బర్లు రాబోతున్నాయని అన్నారు. వైసీపీతోనే అభివృద్ది సాధ్యమనే సంకేతాలను పంపుతున్నారు. కోర్టులో ఉన్న అమరావతి అంశంపైనా తమకు సానుకూల తీర్పు వస్తుందని నమ్ముతున్నారు. ఆ విధంగా సెంటిమెంట్ పెంచుకుంటున్నారు. ముందు ముందు అన్ని ప్రాంతాల విషయంలో అభివృద్ధి అనే అంశంపై మరిన్ని ప్రకటనలు వస్తాయని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో పెద్దగా స్పందించడం లేదు. అప్పులకు మాత్రమే పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నారు. ముందుస్తుకు వెళ్తే కేంద్రం సహకారం అందిస్తుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.
ఆ మేరకు తెలంగాణాతో పాటు ముందస్తుకు వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
Oktelugu Epaper
Exit mobile version