Homeఆంధ్రప్రదేశ్‌Visakhapatnam: కామ పిశాచిని నడిరోడ్డుపై తగినశాస్తి

Visakhapatnam: కామ పిశాచిని నడిరోడ్డుపై తగినశాస్తి

Visakhapatnam: విశాఖలో ఓ మృగాడు రెచ్చిపోయాడు. పసిపిల్లలే లక్ష్యంగా చేసుకుని తన ప్రతాపం చూపాడు. ఫలితంగా మహళల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. అభం శుభం తెలియని చిన్న పిల్లలపై అఘాయిత్యం చేయబోయి దొరికిపోయి దేహశుద్ధి చేయించుకున్నాడు. ముక్కుపచ్చలారని పిల్లలపై పైశాచికం చేశాడు. సామాజిక సేవ ముసుగులో మేకవన్నె పులి మాదిరి తన గుట్టును బయటపెట్టుకున్నాడు. పెన్నులు, పెన్సిళ్లు కొనిస్తానని చెప్పి వారిని లోబరుచుకోవాలని చూశాడు. చివరకు దొరికిపోయి కటాకటాలపాలయ్యాడు.

Visakhapatnam
Visakhapatnam

విశాఖపట్నంకు చెందిన రౌడీషీటర్ వైసీపీ నేతగా చెప్పుకుని చెలామణి అవుతున్నాడు. దీంతో పాఠశాలలో తన కూతురు చదువుతున్నందున అప్పుడప్పుడు వస్తూ వారికి పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్లు కొనిస్తూ మచ్చిక చేసుకున్నాడు. ఇదే అదనుగా భావించి పసిపిల్లలను లోబరుచుకోవాలని పన్నాగం పన్నాడు. దీనికి గాను తన కూతురును ఉపయోగించుకుని వారితో పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ట్యూషన్ కు వెళ్లే చిన్నారులు పెన్నులు, ప్యాడ్ల కోసం అతడి ఇంటికి వెళ్లారు. దీంతో వారిపై అఘాయిత్యం చేయాలని చూశాడు. విషయం కాస్త తల్లిదండ్రులకు తెలియడంతో వారు రోడ్డు మీదకు లాక్కొచ్చి దేహశుద్ధి చేశారు.

ఈ వ్యవహారంపై టీడీపీ విమర్శలు చేసింది. వైసీపీ నేతగా చెప్పుకుంటూ ఇలాంటి ఆకృత్యాలు చేయడంపై కామపిశాచులురెచ్చిపోతున్నారని సంచలన కామెంట్లు చేసింది. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే బదులు వారిని బలిపశువులను చేసే ఉద్దేశంతో వైసీపీ ఆగడాలు చోటుచేసుకుంటున్నాయని వ్యాఖ్యానించింది.

Also Read: Jagan vs Raghurama: అనవసరంగా పెట్టుకొని జగన్ అభాసుపాలయ్యారా?

మల్కాపురం కు చెందిన దోమనా చిన్నారావు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ ముసుగులో అతడు చేసిన దురంతాలపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. వెల్ఫేర్ సొసైటీ ముసుగులో అతడు చేసిన లైంగిక దాడి అందరిలో కోపం తెప్పించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయి రక్తం వచ్చేలా కొట్టారు. చివరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read: Teenmaar Mallanna: బీజేపీలోకి తీన్మార్‌ మల్లన్న! ఇక కేసీఆర్‌కు దబిడిదిబిడే!!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular