spot_img
Homeజాతీయ వార్తలుStock Market : బడ్జెట్ అనంతరం భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ...

Stock Market : బడ్జెట్ అనంతరం భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ పరిస్థితి ఎలా ఉందంటే ? అసలు కారణం ఇదీ

Stock Market : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అదే సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలలో కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ దాదాపు 250 పాయింట్లు నష్టపోయి 77,257 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 104 పాయింట్లు పడిపోయి 23,404 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతుంది. ప్రధానంగా ఐటీసీ హోటల్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, మహీంద్రా & మహీంద్రా, సన్‌ ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లాభాల్లో ఉంటే, టాటా, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే, ఏషియన్‌ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 15 నష్టపోయాయి.. 15 లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 27 నష్టపోయాయి. 23 లాభాల్లో ఉన్నాయి. NSE సెక్టోరల్ ఇండెక్స్‌లోని ఐటీ రంగం అత్యధికంగా 1.02శాతం పడిపోయింది. బడ్జెట్ కు ఒక రోజు ముందు విదేశీ పెట్టుబడిదారులు ₹1,188.99 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

బడ్జెట్‌ ప్రకటనల ప్రభావం.. మార్కెట్‌ దిశ ఏంటి?
విపణి నిపుణుల అంచనా ప్రకారం, బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధానాలు ఉంటే మార్కెట్‌ పాజిటివ్‌గా స్పందించే అవకాశముంది. అయితే, భూమి, కార్మిక రంగాల్లో సంస్కరణలు అవసరమని ఆర్థిక సర్వే సూచించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే 8శాతం వృద్ధి రేటు అవసరమని నివేదిక పేర్కొంది.

గత బడ్జెట్‌లకు మార్కెట్‌ స్పందన ఎలా ఉంది?
గత 5 బడ్జెట్‌ల పరిశీలన చూస్తే,
* 2021 బడ్జెట్ రోజున మార్కెట్‌ 2.1% పెరిగింది.
* 2020 బడ్జెట్ రోజు 2.4% క్షీణతను నమోదు చేసింది.
* 2024 బడ్జెట్‌లో క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ మార్పుల కారణంగా సెన్సెక్స్ 1,200 పాయింట్లు పడిపోయింది.

బడ్జెట్‌ రోజు స్టాక్‌ ఎక్స్చేంజ్‌ పని చేస్తుందా?
ఇటీవల 12 ఏళ్లలో ఇది మూడోసారి శనివారం బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. అయితే, బీఎస్‌ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ మార్కెట్లు ఫిబ్రవరి 1న తెరిచే ఉంటాయి.

ఈసారి మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం?
నిపుణుల అంచనా ప్రకారం, వ్యవసాయం, పవర్, ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్‌ రంగాలకు ప్రోత్సాహం లభించింది. దీంతో ఆ రంగాల స్టాక్స్‌ లాభపడతాయి. కానీ, ప్రభుత్వం ప్రజాప్రియ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టి, పెట్టుబడిదారుల నమ్మకాన్ని తగ్గిస్తే మార్కెట్ నెగటివ్‌ ప్రతిస్పందించే అవకాశం ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version