spot_img
Homeజాతీయ వార్తలుRevanth Reddy: టిక్కెట్ల కేటాయింపు పై అలిగిన రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందంటే?

Revanth Reddy: టిక్కెట్ల కేటాయింపు పై అలిగిన రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందంటే?

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రోజే రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ఇప్పటికే దూకుడు మీద ఉంది. ఇందులో భాగంగా కొన్ని మినహా దాదాపు సిట్టింగులకే సీట్లు కేటాయించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ కు గట్టి పోటీగా మారుతుందనుకుంటున్న కాంగ్రెస్ ఆరు సంక్షేమ పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టికెట్ల విషయంలో పార్టీలో గందరగోళం నెలకొంది. సోమవారం జరిగిన టికెట్ ఎంపిక సమావేశంలో పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, స్క్రీనింగ్ కమిటీల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో రేవంత్ రెడ్డి మధ్యలోనే అలిగిపోయారు.

బీఆర్ఎస్ పార్టీ టికెట్ల కేటాయింపు చేసిన తరువాత కాంగ్రెస్ లో టికెట్లపై ఆశావహులు పెరిగారు. బీఆర్ఎస్ లో టికెట్ రాని వారు కొందరు కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీని నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీలకు 34 సీట్లు కేటాయించకపోవడంపై స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు 74 మంది అభ్యర్థుల లిస్టుకు హైకమాండ్ ఓకే చెప్పింది. మిగిలిన 19 స్థానాలను పెండింగులో ఉంచింది. ఈ తరుణంలో నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం రసాభాసగా సాగింది. కొంతసేపు రేవంత్ రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షుడిపై అగ్రహం వ్యక్తం చేస్తూ హై కమాండ్ వద్ద తేల్చుకుంటామని సవాల్ విసరడం విశేషం..

రేవంత్ రెడ్డి వరంగల్ వెస్ట్ లో నరేందర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ లో అరికెల నర్సారెడ్డి, ఆర్మూరులో రాజారామ్ యాదవ్, ఎల్లారెడ్డిలో సుభాష్ రెడ్డి, దేవరకొండ లో బిల్యా నాయక్, ఇల్లందుకు హరిప్రియ, సూర్యపేట పటేల్ రమేష్ రెడ్డి, చెన్నూరు బోడ జనార్దన్ కు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఆయా నియోజకవర్గాల్లోని వారు వీరికి టికెట్ల కేటాయింపుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయితే స్క్రీనింగ్ కమిటీ సభ్యుల వాగ్వాదంతో అసహనానికి గురైన రేవంత్ రెడ్డి పార్టీ సమావేశం మధ్యలోనే లేచిపోయాడు. దీంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper