Homeఆంధ్రప్రదేశ్‌Republic Day 2023 : జెండా ఆవిష్కరించిన పవన్.. విషెస్ చెప్పిన చంద్రబాబు

Republic Day 2023 : జెండా ఆవిష్కరించిన పవన్.. విషెస్ చెప్పిన చంద్రబాబు

Republic Day 2023 : దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీలోనూ నేతలంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రధాన పార్టీలు కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాయి.

ఏపీలోని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాలాపన చేశారు. పవన్ తోపాటు నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు , జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు అవుతున్న తరుణంలో, నేటికీ రాజ్యాంగ ఫలాలు నోచుకోని ప్రజలకు అందేలా శాసన, న్యాయ, రక్షణ వ్యవస్థలు పారదర్శకంగా కృషి చేయాలని ఆకాంక్షిస్తూ భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు పవన్ కళ్యాణ్.

ఇక చంద్రబాబు కూడా జెండా ఎగురవేసి భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన రాజ్యాంగ పరిరక్షణ కోసం స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో పోరాడుదాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. జై హింద్! అంటూ ట్వీట్ చేశారు.

https://www.youtube.com/watch?v=OKYPBlFjS0g

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular