spot_img
Homeఅంతర్జాతీయంQueen Elizabeth II: ఇండియాకు క్షమాపణలు చెప్పిన క్వీన్ ఎలిజబెత్, ఎందుకంటే?

Queen Elizabeth II: ఇండియాకు క్షమాపణలు చెప్పిన క్వీన్ ఎలిజబెత్, ఎందుకంటే?

Queen Elizabeth II: మనదేశ చరిత్రలో స్వాతంత్ర్య పోరాటం గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇందులో 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ సంఘటన ప్రజల్లో ఎంతటి ఆగ్రహాన్ని కలిగించిందో మనకు విధితమే. మనకు చేదు అనుభవాన్ని మిగిల్చిన అత్యంత హేయమైన ఘటనగా దీనికి పేరు. దీంతో ఆంగ్లేయుల తీరుకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. దాదాపు 1500 మంది ఆత్మార్పణ, 1200 మంది గాయాల పాలు కావడం నిజంగా దురదృష్టమే. దీనిపై ప్రజల్లో ఆవేశం రావడం మామూలే. మనకు బ్రిటిష్ వారు కలిగించిన నష్టాల్లో ముఖ్యమైనది ఇదే కావడం గమనార్హం.

Queen Elizabeth II
Queen Elizabeth II

బ్రిటిష్ వారు చేసిన దరాగాతానికి రాణి ఎలిజబెత్ క్షమాపణలు చెప్పడం మనకు ఆశ్చర్యం కలిగించింది. బ్రిటిష్ పాలకుల నియంతృత్వ ధోరణితోనే ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. దీన్ని అర్థం చేసుకున్న రాణి మనకు సారీ చెప్పడంతో భారతీయులు రాణి పట్ల ఎంతో గౌరవం చూపించారు. తమ దమనకాండకు దృష్టాంతమే జలియన్ వాలాబాగ్ సంఘటన అని ఆమె గుర్తు చేసుకుని మరీ బాధ పడటం అందరిని కలచివేసింది. రాణి పెద్ద మనసుకు అందరు ఫిదా అయ్యారు. అది ఆమెలోని గొప్పదనం అని పొగిడారు.

భారత స్వర్ణోత్సవాల సందర్భంగా 1997లో భారత్ కు విచ్చేసిన రాణి ఎలిజబెత్ తన పర్యటనలో జలియన్ వాలాబాగ్ ను సందర్శించాలని అనుకోవడంతో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగాయి. కానీ ఆమె మాత్రం జలియన్ వాలాబాగ్ ను సందర్శించి అక్కడ చనిపోయిన వారికి నివాళి అర్పించి తన గొప్ప మనసును చాటుకుంది. చెప్పులు విడిచి తన మంచితనాన్ని ప్రదర్శించి అందరిలో గొప్ప వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం నాటి గుర్తులను తలుచుకుని బాధ వ్యక్తం చేయడం గమనార్హం.

Queen Elizabeth II
Queen Elizabeth II

ఎలిజబెత్ కాషాయ వస్త్రాలు ధరించి అమరవీరుల స్మృతుల ముందు పుష్పగుచ్చాలు ఉంచి మౌనాన్ని పాటించారు. 2013లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్ స్వర్ణోత్సవాల వేళ బ్రిటిష్ రాణి ఎలిజబెత్ చేసిన ప్రసంగాన్ని తలుచుకుని ఆమె చేసిన దాన్ని సమర్థించారు. భారతీయుల బాధలకు తామే కారణమని పరోక్షంగా ఒప్పుకున్నారు. మీకు తలవంపులు తెచ్చినందుకు క్షమించండని వేడుకోవడం సంచలనం కలిగించింది. స్వాతంత్ర్య పోరాట సమయంలో మనపై బ్రిటిష్ వారు చేసిన దారుణాలకు ఎలిజబెత్ స్వయంగా తానే సారీ చెప్పడం ఆమె హుందాతనానికి నిదర్శనంగా మారింది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version