spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu On PK: చంద్రబాబు కోరినా నో చెప్పి షాకిచ్చిన పీకే

Chandrababu On PK: చంద్రబాబు కోరినా నో చెప్పి షాకిచ్చిన పీకే

Chandrababu On PK: మొన్న ఆ మధ్యన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిశారు. చాలా గంటలసేపు చర్చలు జరిపారు. దీంతో టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారని ప్రచారం ప్రారంభమైంది. లోకేష్ తో పాటు ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్ నేరుగా చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఇది రాజకీయంగా కలకలం రేపింది. గత ఎన్నికల్లో జగన్ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. ఒక్కసారిగా చంద్రబాబు వద్ద కనిపించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. టిడిపి కోసం పనిచేసేందుకు పీకే ముందుకు వచ్చారని ప్రచారం జరిగింది. అయితే ప్రశాంత్ కిషోర్ పూర్తి సమయం కేటాయించేందుకు కాదని.. ఎన్నికల వరకు కీలకమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మాత్రం అంగీకరించారని టాక్ నడిచింది.

గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓటమి ఎదురు కావడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. ప్రశాంత్ కిషోర్ ను తన రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు. నేరుగా పార్టీ సమావేశంలోనే పీకే ను నేతలకు పరిచయం చేశారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీం పనిచేస్తుందని ప్రకటించారు. అప్పటినుంచి పీకే టీం ఏపీలో తన సేవలను ప్రారంభించింది. రాజకీయ సమీకరణలను వైసీపీకి అనుకూలంగా మార్చింది. గత ఎన్నికల్లో జగన్ అద్భుత విజయానికి పీకే సేవలు కూడా ఒక కారణమన్న విశ్లేషణ ఉంది. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహకర్త పదవిని ప్రశాంత్ కిషోర్ విడిచిపెట్టారు. బీహార్ రాజకీయాల వైపు అడుగులు వేశారు. కానీ పీకే ఐపాక్ మాత్రం జగన్ కోసం పనిచేస్తోంది. దానికి రుషిరాజ్ సింగ్ సారధిగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ టీం పని చేస్తోంది. రాబిన్ శర్మ పూర్వాశ్రమంలో ఐపాక్ టీం సభ్యుడే. ప్రశాంత్ కిషోర్ సమకాలీకుడు. గత నాలుగు సంవత్సరాలుగా టిడిపికి సేవలందిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు తన వద్దకు తెప్పించుకున్నారు. కీలక చర్చలు జరిపారు. అప్పటినుంచి పీకే తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా ఉంటారని ప్రచారం ప్రారంభమైంది. అయితే దానిపై తెలుగుదేశం పార్టీ కానీ.. ప్రశాంత్ కిషోర్ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. దానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు.

తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ స్పష్టతనిచ్చారు. చంద్రబాబు టిడిపి తరుపున రాజకీయ వ్యూహకర్తగా పనిచేయాలని కోరారని.. కానీ తాను సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు. తాను బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నానని.. ఇప్పటికే వైసీపీకి సేవలు అందించానని.. సలహాలు,సూచనలు మాత్రమే అందించగలనని చంద్రబాబుకు చెప్పినట్లు స్పష్టతనిచ్చారు. అయితే వ్యూహంలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిశారని.. అంతకుమించి ఏమీ లేదని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే వ్యూహాత్మకంగా చంద్రబాబు వద్దకు ప్రశాంత్ కిషోర్ వెళ్లారని మరో టాక్ నడుస్తోంది. మొత్తానికి అయితే తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబుకు కానీ పనిచేయడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టతనిచ్చారు. గత కొద్దిరోజులుగా రేగుతున్న ఊహాగానాలకు తెరదించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper