spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: 50 మందిని చంపాలని చూశారా.. పవన్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: 50 మందిని చంపాలని చూశారా.. పవన్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని భావిస్తున్న పవన్.. వైసీపీ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ క్రిమినల్ ఆలోచనలను ఎండగట్టారు. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో పవన్ ఆగ్రహంగానే స్పందించారు. తాను జైలుకు వెళ్లాను కాబట్టి .. ప్రత్యర్ధులు సైతం వెళ్లాలనే ఆలోచన జగన్ ది అని చెప్పుకొచ్చారు. చట్టాలు సంపూర్ణంగా పని చేసి ఉంటే జగన్ అనే వ్యక్తి జన్మలో అయినా ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి చీకటి రోజులని.. ప్రజలంతా మేల్కొనాల్సిన అవసరం ఉందని పవన్ తేల్చి చెప్పారు.

నాడు వారాహి యాత్రలో వైసీపీ సర్కార్ కుట్రను తాజాగా బయటపెట్టారు. కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర కొనసాగిన సందర్భంలో శాంతి భద్రతల కు విఘాతం కల్పించేందుకు ప్రయత్నించారని.. ఇందుకోసం 2000 మంది నేరగాళ్లను దింపారని.. కోనసీమలో 50 మందిని చంపేయాలని పథకం వేశారని పవన్ ఆరోపించారు. అయితే ఈ కుట్ర గురించి తెలుసుకున్న కేంద్ర పెద్దలు నిలువరించారని పవన్ చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ప్రతి అక్రమానికి వైసీపీ నేతలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని.. ప్రభుత్వం మారిన వెంటనే కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని పవన్ హెచ్చరించారు. సీఎం జగన్ రాష్ట్రంలో దోచుకున్న మొత్తాన్ని లండన్ లో దాచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు పవన్ ఆరోపణలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చంద్రబాబు గురించి ఇంతలా ఎందుకు పరితపిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని.. అలా అడిగి అర్హత వైసిపి నేతలకు లేదని పవన్ తేల్చి చెప్పారు. విశాఖలో తనను పోలీసులు అడ్డుకున్నప్పుడు చంద్రబాబు స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబును అక్రమంగా, కనీస నిబంధనలు పాటించకుండా అరెస్టు చేయడంపై తాను స్పందించానని చెప్పుకొచ్చారు. ఇలా స్పందించడం ఒక సంస్కారం అని వైసిపి నేతలకు గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను తాను గట్టిగానే ప్రశ్నిస్తానని.. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావు లేదన్నారు. తాను చివరి వరకు జగన్ అవినీతిపై పోరాడుతానని స్పష్టం చేశారు.

అయితే పవన్ దూకుడు చూసి వైసిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. మున్ముందు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందన్న హెచ్చరిక వారిని భయపెడుతోంది. చంద్రబాబు అరెస్టుతో టిడిపి, జనసేన మరింత దగ్గర అయ్యాయి అన్న భావన వైసీపీ నేతల్లో ఉంది. అటు విపక్షాలు సైతం ఏకతాటిపై రావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు కేంద్రం విషయం కూడా తెలియక వైసీపీ నేతలు సతమతమవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో సానుభూతి, ఆపై పవన్ దూకుడు చూస్తుంటే తమకు చిక్కులు ఖాయమని వైసీపీ నేతలు భయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Oktelugu Epaper