
Pawan Kalyan – Nagababu : జనసేన.. జనంతోనే ఏర్పడిన సేన.. ఒక రాజకీయ పార్టీ అన్నాక బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, దిగ్గజాలు ఉంటారు. వారందరినీ నుంచి విరాళాలు తీసుకొని నడుస్తుంది. కానీ మకలి రాజకీయాలకు దూరంగా తన స్వంత కష్టంతో తను సినిమాల్లో సంపాదించిన సొమ్మును ఖర్చు చేస్తూ పార్టీని నిలబెట్టాడు పవన్ కళ్యాణ్. ఏ ఒక్కరి నుంచి రూపాయి ఆశించకుండా పార్టీని ఏపీలో ఈ స్థితికి చేర్చాడు.
జనసేనలో ఇన్నాళ్లు ఇద్దరే కీలక నేతలుగా.. పార్టీ వ్యవహారాలు చేసుకునేవారు. ఒకరు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే.. మరొకరు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. నాగబాబు ప్రస్తుతం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉండేవారు. అయితే ఆయన సేవలు మరింత విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.
నాగబాబుకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. నాగబాబు సేవలను మరింతగా విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించారు.
ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో పర్యటించిన నాగబాబును పార్టీలో మరింతగా కీలక బాధ్యతలు నిర్వహించాలని జనసైనికులు కోరారు. విదేశాల్లోని పార్టీ ప్రతినిధులు, అభిమానులు సైతం ఇదే విన్నవించారు. దీంతో నాగబాబుకు ఈ ఎన్.ఆర్ఐ సేవలను పార్టీకి సమర్థవంతంగా ఉపయోగపడే విధంగా నాగబాబు సేవలు వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.
-వేములపాటి అజయ్ కుమార్ కు కీలక బాధ్యతలు
నాగబాబుతోపాటు పార్టీలో నెల్లూరుకు చెందిన ఉన్నత విద్యావంతుడు జనసేనకు సేవలందిస్తున్న వేములపాటి అజయ్ కుమార్ కు పార్టీకి సంబంధించి ముఖ్య వ్యవహారాల బాధ్యతలను పవన్ కళ్యాణ్ అప్పగించారు. జాతీయ మీడియాకు పార్టీ తరుఫున అధికార ప్రతినిధిగా.. రాజకీయ శిక్షణ తరగతులు, బూత్ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ నిర్వహణ బాధ్యతలను అజయ్ కుమార్ కు అప్పగించారు.
నాగబాబు, అజయ్ లు పార్టీకి మేలైనా సేవలు అందిస్తారన్న గట్టి నమ్మకాన్ని పవన్ వ్యక్తం చేశారు.